Tuesday, November 13, 2012

హనుమత్ ప్రార్థన (Hanumath Praarthana)

 అరణ్యపర్వ భాగంలోనే నన్నయ మహర్షి భీమసేనునకు సౌగంధిక పుష్పసమయంలో హనుమంతుని దర్శనభాగ్యం కలిగించాడు. ఆశ్చర్యకర విషయమేమంటే ఆ మూర్తిని ఆయన ఎలాగ తన మనః ఫలకంపై ముద్రించుకున్నాడో చదవండి. 

సీ: హ్రస్వపీనగ్రీవు నచలితాయతహను నతి చపలస్వభావాభిరాము
దనుమధ్యకటిచక్రు, దహనకణాకారతామో్రషు్ఠ, నతికృశదశనకరజు
బృథులవిద్యుత్ పింజ పింగాక్షు, నుత్తుంగదృఢవక్షు, నాజాను దీర్ఘబాహు నూర్ధ్వలాంగూల మత్యున్నతధ్వజ లీల గ్రాలుచునుండ నేకాంతయోగ నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతు జూచి పాండురాజుసుతుడు వాని నిద్ర జెఱుప గడగి నిజసత్త్వమేర్పడ సింహనాద మొప్ప జేసే డాసి".

భీమసేనుడు దర్శించిన హనుమంతుని వర్ణన:

   "తదేకధ్యానయోగమనే గాఢనిద్రలో ఉన్నవాడు, ధర్మం చేత నిర్మలమైన వ్యక్తిత్వం గలవాడు, పొట్టిగా బలిష్ఠంగా ఉన్న కంఠభాగం గలవాడు, కదలని పొడుగాటి మీది దవడ గలవాడు, నిలుకడ లేని స్వభావం చేత ముచ్చట గొలిపేవాడు, సన్నని నడుముతో గుండ్రని మొలభాగం గలవాడు, నిప్పు కణంవలె ఎర్రనైన పెదవులు గలవాడు, మిక్కిలి కృశించిన దంతాలు, గోళ్లు గలవాడు, మెఱపు తీగల సముదాయం వంటి గోరోజనవర్ణంతో భాసించే కన్నులు గలవాడు, ఎత్తైన బలిష్ఠమైన రొమ్ము గలవాడు, మోకాళ్ల వరకు వ్యాపించిన నిడివైన చేతులు గలవాడు, ఎత్తుగా నిక్కబొడిచిన తోక మిక్కిలి ఎత్తుగా ఉన్న జండావలె ప్రకాశిస్తున్నవాడైన హనుమంతుని చూచి, తన బలం వ్యక్తమయ్యేటట్లు గొప్పగా భీమసేనుడు సింహనాదం చేశాడు. 

                                                                *****

No comments:

Post a Comment